రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు జగను ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. బార్లలో మద్యం విక్రయాలు జరపొద్దని తేల్చి చెప్పింది. కానీ బార్లలో ఉన్న మద్యం సీల్ బాటిళ్లను సమీపంలోని రిటైల్ ఔట్ లెట్ల ద్వారా విక్రయించే వెసులుబాటు కల్పించింది.
కేవలం సీల్డ్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని ఆదేశాల్లో తెలిపింది.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.. రాష్ట్రంలో వైన్స్ షాప్స్ తెరుచుకున్నా రెండు సార్లు మద్యం ధరలను పెంచేసింది.
దీంతో క్రమంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మందగించాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను పెంచామని మద్యం షాపులను కూడా క్రమంగా తగించినట్టు ప్రభుత్వం చెబుతోంది.కాగా రాష్ట్రంలో వైన్స్ షాపులు,బార్లు తెరవక పోవడంతో బీర్ బాటిళ్ల కాల పరిమితి ముగిసిపోయే అవకాశముందని వాటిని విక్రయించేందుకు అవకాశం కల్పించాలని ఏపీ వైన్ డీలర్స్ అసోసియేషన్ కోరి౦ది.