అమరావతి: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం అట్టహాసంగా జరిగే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవాని ఆంధ్ర రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి అతిరధమహారధులు హజరు కానున్నారు.
నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ ఇప్పటికే
ప్రధాని నరేంద్రమోది, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, డిఎంకె అధినేత స్టాలిన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కెవిపి రాంచందర్రావు, తదితరులకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
మంగళవారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి ఫోన్ చేసిన జగన్ తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రముఖ సినీనటులు మోహన్ బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందినట్లు సమాచారం. తెలంగాణ సిఎం కెసిఆర్, డిఎంకె నేత స్టాలిన్ ప్రమాణ స్వీకారంలో పాల్లొనేందుకు ఈ రోజు రాత్రికే విజయవాడ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?