విజయవాడ: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులు వేదికను ఖరారు చేశారు.
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిన అవుటపల్లి జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఒక ప్రాంతంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావించినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం విజయవాడలోనే వేదిక ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీలో కూర్చునే అవకాశం ఉండటంతో పాటు మరో 20వేల మంది దిగువన కూర్చునే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్బమణ్యం అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తేలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర వివిఐపిలు హజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను సిఎస్ ఆదేశించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?