Ys Jagan: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి అని ప్రతిపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి పరంగా జరగలేదని.. ఎవరు పెట్టుబడులకు కూడా రావటం లేదని.. ప్రతిపక్షాలు గత కొంత కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా దేశంలో పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రాజెక్టు టుడే సంస్థ నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ప్రభుత్వం 54,714 కోట్లు పెట్టుబడులు రాబటగా… రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 29,784 కోట్లు రాబ్బటడం జరిగింది.
ఇక మూడవ స్థానంలో గుజరాతి 26 వేల ఐదు వందల ముప్పై కోట్లు, నాలుగవ స్థానంలో తమిళనాడు 24 వేల కోట్లతో నిలిచింది. దేశం మొత్తం మీద కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలకు చాలావరకు ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు.. ఆ రీతిగా జగన్ ప్రభుత్వం ఒకపక్క పెట్టుబడులు మరోపక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రంలో పరుగులెత్తిస్తున్నట్లు తాజా వార్త పై వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టుబడుల విషయంలో చేస్తున్న ఆరోపణలు తాజా ప్రాజెక్టు టుడే నివేదిక బట్టి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని తేలిపోయింది అని అంటున్నారు.