గత వారం వైసీపీకి చెందిన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజ్యసభకు ఎన్నికవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైఎస్ జగన్ తన క్యాబినెట్ ను విస్తరించడానికి సిద్ధమయ్యారు.
22న మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. రేపు ఆషాఢ మాసం పూర్తై శ్రావణం వస్తుంది. దీంతో ముహూర్తం ప్రకారం 22న విస్తరణ చేయనున్నారు. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల స్థానాలలో ఇద్దరు ఎంపిక కానున్నారు. జగన్ రాజీనామా చేసిన మంత్రుల సామజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాబట్టి రాజీనామా ఇచ్చిన మంత్రులు బిసిలు కావడంతో కొత్త మంత్రులు కూడా అదే సామజికవర్గానికి చెందిన వారు అవుతారు.