వచ్చే నెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక విషయాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పరిపాలన వీకేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టులో ఈ నెల 27న విచారణ ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో నిర్ణయం సానుకూలంగా ఉంటే రాజధాని మార్పుపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశముందిటూరిజం పాలసీ అంశంపై వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తోన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయితే సేకరించిన భూములు వివాదాస్పదమవుతున్నాయి. అలాగే మరికొన్ని అంశాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో తీసుకోవచ్చు.