ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన రాజకీయ కుటుంబం అచ్చెన్నాయుడు కుటుంబం. అచ్చెన్నాయుడు అంతకుముందు దివంగత ఎర్రన్నాయుడు ఇద్దరు అన్నదమ్ముల కుటుంబం టీడీపీకి నమ్మకమైన కుటుంబంగా తెలుగు రాజకీయాల్లో ముద్ర ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన కుటుంబంగా వీరికి పేరు ఉండటంతో జగన్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి లో తన పార్టీ తరపున శోభానాగిరెడ్డి చేత అచ్చెన్నాయుడు కి రాయబారం పంపి వైసీపీ లోకి రావాలని ఆహ్వానించినట్లు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అచ్చెన్నాయుడు జగన్ ఆఫర్ ని కాలదన్ని టీడీపీకి పూర్తి విధేయుడిగా వ్యవహరించి ఆ ఎన్నికలలో గెలిచి మంత్రి అవటం జరిగింది.
చంద్రబాబుకి ఎంతో పూర్తి విధేయుడిగా 2014 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద వైయస్ జగన్ ని ఏకిపారేసిరు. 2019 ఎన్నికలలో గెలిచినా తర్వాత అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద విమర్శలు చేయడంలో స్పీడ్ తగ్గించ లేదు. కాగా ప్రజెంట్ ESI కుంభకోణం ఆరోపణల్లో అరెస్ట్ అవ్వడంతో జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ దివంగత ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని తో చంద్రబాబు రాజకీయాలకు సరికొత్త చెక్ పెట్టడానికి స్కెచ్ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికలలో ఆమె తెలుగుదేశం పార్టీకి టిక్ పెట్టకుండా.. ఓటు చేల్లని విధంగా వ్యవహరించడం వెనకాల వైసిపి హస్తం ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.
దీంతో అచ్చెన్నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఆదిరెడ్డి భవాని ఈ విధంగా వ్యవహరించడం వెనకాల వైఎస్ జగన్ స్కెచ్ ఉందని అచ్చెన్న ఫ్యామిలీతో బాబుకి వైరం జగన్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొక పక్క అసలు ఆ స్కామ్ లో లోకేష్ వెళ్లాల్సి ఉందని కానీ అచ్చెన్నాయుడు ని ఒక ఉద్దేశపూర్వకంగా చంద్రబాబునాయుడు బలి చేసినట్లు ఆదిరెడ్డి భవాని భావించి రాజ్యసభ ఎన్నికల్లో టిడిపికి చిన్న షాక్ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు ఊపందుకుంటున్నయి.