Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan బుధవారం విశాఖపట్టణం పర్యటనకు రెడీ అవుతున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకమైన విమానంలో బయలుదేరి విశాఖపట్టణం లో ఉదయం 10.10 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి జగన్ చేరుకుంటారు.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొని అనంతరం 12 గంటల యాభై నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయం నుండి తిరిగి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో జగన్ పర్యటనకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు విషయంలో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయానికి సంబంధించి అనేక పార్టీలు ఇప్పటికే ఉద్యమం చేపడుతున్న తరుణంలో రేపు జగన్ వైజాగ్ పర్యటన పై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.