టిడిపి నేతలు ఈ మధ్య నోరు తెరిస్తే రాజారెడ్డి రాజ్యాంగమని మాట్లాడుతున్నారు! ఇదేమిటని ఆరా తీస్తే అది వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాత వైయస్ రాజారెడ్డిని ఉద్దేశించి చేస్తున్న విమర్శగా తేలింది.
అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాన్న గురించి అన్నమాట!రాజారెడ్డి అనేది నిజానికి పరిచయం అవసరం లేని పేరు!ఆయన కడప జిల్లాలో చేసిన అరాచక లేమితో పెద్దగా ఎవరికీ తెలియదు!కాకుంటే ఆయన భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ అని మాత్రం విపరీత ప్రచారం జరుగుతుంటుంది!అసలు రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అంతకు మించి ఆయన రాజకీయంగా ఏ పదవుల్లో ఉన్న దాఖలాలు లేవు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడిగా సీపీఐ అభ్యర్థులకు పులివెందుల్లో ఏజెంట్గా కూచునేవారు. అంతకు మించి ఆయన రాజకీయ ఉనికి గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.ఇంకా చెప్పాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వివాదాస్పదుడు.
ఆయన చంద్రబాబునాయుడి సమకాలికుడు.1978లో ఈ ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశించారు ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే.కాబట్టి వీరి గురించి ఒకరికొకరికి బాగా తెలుసు!పైగా చంద్రబాబు నాయుడు పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంచింది కూడా రాజశేఖర్రెడ్డే! కాబట్టి చంద్రబాబు కి కోపం ఉంటే రాజశేఖర్ రెడ్డిపై ఉండాలి గానీ అతని తండ్రి రాజారెడ్డి పై ఎందుకన్నది ప్రశ్న!విచిత్రంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖరరెడ్డి పేరుతో కాకుండా రాజారెడ్డి రాజ్యాంగంగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్ పదేపదే విమర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జగన్ పాలనా విధానాలను విమర్శించాలంటే ఎప్పుడో చనిపోయిన రాజారెడ్డినే గుర్తు చేసుకోవాలా? రాజారెడ్డి అంతగా వారినిభయపెడుతున్నారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు!రాజశేఖరరెడ్డిని కాకుండా రాజారెడ్డిని టిడిపి నేతలు విమర్శిస్తున్నారంటే డాక్టర్ వైఎస్ వారి దృష్టిలో గొప్పవాడని అర్థం చేసుకోవచ్చు కదా అని వారు అంటున్నారు?రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వెంటనే లోకేష్ కూడా స్పందిస్తూ రాజారెడ్డి రాజ్యాంగం అని ఒక కామెంట్ విసురుతున్నారు.ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు లోకేశులు తలుచుకున్నట్లుగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా తన తాత రాజారెడ్డిని గుర్తు చేసుకోరన్న సెటైర్లు పడుతున్నాయి