YS Sharmila: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. కెసిఆర్ కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు .. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరరు అంటూ విరుచుకుపడ్డారు.
YS Sharmila: సర్కారు దవాఖానాలను సక్కగా చేయి దొరా!
కేసీఆర్ దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్ కు దోచిపెడుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్స్ లో వసతులు ఉండవు .. సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది.. హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానన్న దానికి మోక్షం లేదు.. ప్రజల ఆరోగ్యానికి సరిపోను బడ్జెట్ ఇచ్చెదిలేదు.,ఉస్మానియా.. గాంధీ, నిమ్స్ .. టిమ్స్ ఆస్పత్రులకే ఊపిరి సక్కగా అందుతలేదు, ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలొ దీపం..కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా వైద్యానికి .. రేటు ఎక్కువ, జనం కరోనా నుండి బతికి బయటపడితెే.. అప్పులతో చచ్చేటట్టుంది.. కేసీఆర్ సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చు అంటూ వైఎస్ షర్మిళ ట్విట్టర్ వేదికగా కోరారు.
మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన ఎస్సై!
చట్టం అందరికీ సమానమే అంటూ ఓ ఎస్సై.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డికిజరిమానా విధించాడు. కర్మన్ఘాట్ చౌరస్తా వద్ద సరూర్నగర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో అటువైపుగా వెళ్తున్నారు. దాంతో పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సబ్ ఇన్స్పెక్టర్ ముకేష్.. తీగలను ప్రశ్నించాడు. అందుకు తాను మాజీ ఎమ్మెల్యేనని వాగ్వాదానికి దిగాడు. దాంతో మాకు అందరూ సమానులేనని ఎస్సై సమాధానమిచ్చి.. తీగలకు రూ. వెయ్యి ఫైన్ విధించాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?