YS Sharmila: తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలుగు రాష్ట్రాలలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ అధినేత కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం అనేది తన సొంత నిర్ణయమని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా తెలిపారని.. తెలంగాణలో పార్టీ స్థాపించి దాని విషయంలో అనేక చర్చలు జరిగాయని.. కాని తెలంగాణలో పార్టీ పెట్టడం తన సొంత నిర్ణయం అని షర్మిల క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయంలో కుటుంబ సభ్యుల నుండి అనేక ఒత్తిడి వచ్చినా తాను వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఇటువంటి తరుణంలో ఏపీలో సజ్జల రామకృష్ణారెడ్డి.. సంబంధంలేదని అనే పదం వాడటం తనకు ఎంతగానో బాధ కలిగించిందని.. షర్మిల తెలియజేశారు. ఆమె ఇంటర్వ్యూ లో ఏమన్నారంటే…”నేను రాజకీయాల్లో మొట్టమొదటి అడుగువేసిన రోజున రామకృష్ణారెడ్డి ఇక సంబంధం లేదు అనే పదం వాడాడు. అదే జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం నేను శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా వాళ్లు ఏం అడిగితే అది చేశాను. ఎందుకు చేశానంటే బాధ్యత ఉంది కాబట్టి చేశాను… రక్తసంబంధం ఉంది కాబట్టి చేశాను. అలాంటిది సంబంధం లేదు అనే ఒక్కమాటతో తేల్చేశారు.
విభేదాలు లేనిది ఎక్కడ? అందరి ఇళ్లలో ఉంటాయి. విభేదాలు ఉన్నంత మాత్రాన సంబంధం లేదు అనడం సరికాదు” అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ పెట్టడం వెనకాల కేసీఆర్ అదేరీతిలో జగన్ హస్తాలు ఉన్నట్లు ఆ మీడియా అధినేత ప్రశ్నించగా ఎవరి ప్రాబ్లం లేదు తెలంగాణ ప్రజల కోసం.. రాజన్న సంక్షేమం కోసం పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన సమయంలో తల్లి వైయస్ విజయమ్మ.. మొదట ఆలోచించిన తర్వాత తనను ఎంతగానో ప్రోత్సహించడం జరిగిందని అడ్డు చెప్పలేదని తెలియజేశారు. తన ప్రతి పోరాటంలో తల్లి విజయమ్మ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు.