దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు. తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. 2014, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే వైఎస్ఆర్ మరణంపై మాట్లాడిన వైఎస్ షర్మిల.. తాజాగా ఇప్పుడు మరల వైఎస్ఆర్ మరణంపై మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.
తాను వైఎస్ఆర్ (పులి) బిడ్డను, భయం అంటే ఏమిటో తెలియదు ఈ విషయాన్ని సీఎం కేసిఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్ కు ఫిర్యాదు చేసారనీ, తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బేడీలను ప్రదర్శిస్తూ ఈ బేటీలకు, అరెస్టులకు తాను భయపడననీ, ధైర్యం ఉంటే అరెస్టు చేయడానికి పోలీసులను పంపాలని సవాల్ విసిరారు. తాను బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసం పోరాటం చేస్తానని అన్నారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు పోలీసు కేసులు పెడుతున్నారని షర్మిల విమర్శించారు. కేసిఆర్ పై, పోలీస్ వ్యవస్థపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. తనను అవమానించిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించలేదని అన్నారు వైఎస్ షర్మిల. తనపై కేసులు పెట్టడానికి ఏకమైన పాలమూరు ఎమ్మెల్యేలు .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఏకమై ఉంటే బాగుండేదని అన్నారు. అవినీతిపై తాను మాట్లాడితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఏపి రాష్ట్ర వ్యవస్థ బేషూగ్గా ఉన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మండిపాటు