YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కలవనున్నారు. మంగళవారం వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళుతుండగా పోలీసులు ఆమెను కారులో ఉండగానే ట్రాఫిక్ క్రైన్ వాహనంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం, ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ ల కింద ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. రాత్రికి ఆమెను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయడంతో లోటస్ పాండ్ కు చేరుకున్నారు. అయితే ఈ పరిణామాలపై గవర్నర్ తమిళి సై ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అపాయింట్మెంట్ కోసం వైఎస్ఆర్ టీపీ నాయకులు రాజ్ భవన్ ను సంప్రదించగా, గవర్నర్ తమిళి సై గురువారం ఉదయం 11.30 గంటలకు అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది.
షర్మిల అరెస్టు సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా బుధవారం స్పందించారు. వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయన్నారు. ఇలా షర్మిలకు సంఘీభావం తెలిపేలా గవర్నర్ ట్వీట్ చేయడంతో షర్మిల .. తమిళి సై ని కలిసి తన పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కల్గిస్తున్న ఇబ్బందులు, ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ ..రిమాండ్ రిపోర్టు తిరస్కరించిన న్యాయమూర్తి