YS Sharmila: తెలంగాణలో కరోనా చావులతోపాటు.. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుందని, దయచేసి ఇప్పటికైనా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని వైఎస్ షర్మిల కోరారు. కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని.. ఆసుపత్రుల్లో అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు కట్టనిదే.. శవాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు.
ఒకవైపు ఆస్తులను పోగొట్టుకొని కనీసం దహనసంస్కారాలకు కూడా డబ్బులు లేక, శవాలను సొంతూర్లకు తీసుకపోలేక.. అక్కడే అంత్యక్రియలు జరిపిస్తున్న దుస్థితి ఏర్పడిందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.బతుకులు ఆగమాయె’ పేరిట తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా కరోనా బారినపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.సమీక్షలు సమావేశాల కంటే ముందు సత్వర నిర్ణయాలు తీసుకొని కరోనా వ్యాధికి చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆమె ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేశారు.
మాతృ దినోత్సవం రోజున ఘోర విషాదం!
కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విపరీతమైన డ్యామేజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్లోలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో ఎక్కువగా ఏజ్ ఏక్కువ ఉన్నవాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కన్నుమూశారు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం యంగ్ పీపుల్ కూడా వ్యాధి భారినపడి కన్నుమూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గుడి మల్కాపూర్ బిజెపి కార్పోరేటర్ దేవర కరుణాకర్ కుమార్తె భవాణి కరోనా భారినపడి మృతి చెందింది. గతనెల 20న ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల్లోనే కరోనాతో కన్నుమూసింది. అయితే భవానీకు డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద వున్న భవాని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడాచారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకున్నాయి.