కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ నేడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను విమర్శించారు. వైఎస్ఆర్ పదవ వర్థంతి కార్యక్రమాల్లో సోమవారం పాల్లొన్న విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.
నాడు వై ఎస్ అర్ చేసిన మేలు గుర్తు పెట్టుకున్న ప్రజలు నేడు జగన్ ను అక్కున చేర్చుకున్నారని విజయమ్మ అన్నారు.తండ్రి ఆశయాలు నిలబెడతాడని ప్రజలకు జగన్ పై నమ్మకం ఏర్పడిందని విజయమ్మ అన్నారు. వై ఎస్ ఆర్ లేక పదేళ్లు అవుతున్నా ఆ బాధ ఎవరిలోనూ తగ్గలేదని విజయమ్మ గుర్తు చేశారు.
తన తండ్రి కంటే ప్రజలకు ఎక్కువ మేలు చేయాలన్న తపన జగన్ లో ఉందని విజయమ్మ అన్నారు. మంచి మనసుతో మంచి పనులు చేయాలనుకునే వారికి పకృతి తో పాటు దేవుడు కూడా సహకరిస్తాడని విజయమ్మ వ్యాఖ్యానించారు.