YS Vijayamma: వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సెప్టెంబర్ 2వ తారీఖు హైదరాబాద్ నగరంలో స్పెషల్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోజు వైయస్ వర్ధంతి సందర్భంగా… రాజకీయాలకు అదేరీతిలో పార్టీలకతీతంగా వైయస్ తో పని చేసిన వారిని ఆహ్వానించి… ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయనతో పనిచేసిన మంత్రివర్గంలోని సభ్యులను కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్.. అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ఇంకా అప్పటి ప్రభుత్వ సలహాదారులను.. శ్రేయోభిలాషులకు ఆత్మీయులను.. ఆహ్వానిస్తూ..స్వయంగా విజయమ్మ.. వారందరికీ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
2009 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో… వైఎస్ వర్ధంతి కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అభిమానులు వైసిపి పార్టీ కార్యకర్తలు.. నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నగరంలో.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి వైయస్ జగన్ వస్తారా..? లేదా అన్నది ఇంకా ఎవరికీ అర్థం కావటం లేదు. కచ్చితంగా ఆ రోజు మాత్రం వైయస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు.
కుటుంబ సమేతంగా కలిసి ఆరోజు వైయస్ జగన్ వైయస్సార్ సమాధిని సందర్శిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో తల్లి వైయస్ విజయమ్మ చేపట్టబోయే కార్యక్రమం లో జగన్ హాజరు అవుతారా లేదా అన్నది తాజాగా సస్పెన్స్ గా ఉంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇది మూడో వర్ధంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఇప్పటినుండే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోపక్క వైయస్ విజయమ్మ… రాజకీయాలకు.. పార్టీలకతీతంగా సెప్టెంబర్ రెండవ తారీకు.. హైదరాబాద్ నగరంలో వైయస్ వర్ధంతిని జరిపించాలని డిసైడ్ అవ్వడం తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.