NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు..! ఏమిటంటే..?

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఒ వ్యక్తి ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీస్ స్టే,న్ లో కేసు నమోదు అయ్యింది. ఇది ఒక కీలక పరిణామం కాగా, మరో పక్క వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు షేక్ దస్తగిరి సీబీఐ అధికారులకు గత సెప్టెంబర్ 30న ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. ఈ రోజు పులివెందుల కోర్టులో నలుగురు నిందితులను సీబీఐ హజరుపర్చింది. నిందితులకు సంబంధించిన అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాలతో సంబంధిత న్యాయవాదులకు సీబీఐ అందజేసింది. అందులో భాగంగా దస్తగిరి గతంలో సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

YS Viveka Murder Case: సాక్షిగా మారిన నిందితుడికి ప్రలోభాలు

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గత ఏడాది అక్టోబర్ 31న ప్రొద్దుటూరు కోర్టులో సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ తరువాత సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పవద్దని మభ్యపెట్టి లొంగదీసుకునేందుకు సంప్రదించారని దస్తగిరి సెప్టెంబర్ 30వ తేదీన సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ తరచు తన ఇంటికి వచ్చే వాడనీ, సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావు. ఏం స్టేట్ మెంట్ ఇచ్చావు. ఆ వివరాలు అన్నీ అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకరరెడ్డికి తెలియజేయాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సీబీఐ నిఘాలో ఉన్నాననీ, ఎక్కడికీ రాలేననీ దస్తగిరి చెప్పినట్ల వివరాల్లో నమోదైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు బయట పెట్టవద్దనీ, పది లేదా 20 ఎకరాల భూమి, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని తనను మభ్యపెట్టారనీ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఎవరెవరు ఎప్పుడు కలిసిందీ వివరాలు అందులో ఉన్నాయి.

 

దస్తగిరి ఫిర్యాదులో కీలక వ్యక్తులు

దస్తగిరి చెప్పిన కొత్త విషయాలు వెలుగులోకి రావడం, కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఒక పక్క వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న  సీబీఐ అధికారిపై పోలీసు కేసు నమోదు కావడం, మరో పక్క దస్తగిరి చెప్పిన కొత్త విషయాలు వెలుగులోకి రావడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. మరో పక్క తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని దస్తగిరి సీబీఐ అధికారులను కోరారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగి సీబీఐ వద్ద అప్రూవర్ గా మారలేదనీ, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు దస్తగిరి. రెండవ సారి మెజిస్ట్రేట్ వద్ద వ్యాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు దస్తగిరి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju