రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హత్యల్లో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ ఒకటి! అసలు ఈ హత్య ఎలా జరిగింది అనే విషయంపైనే పూర్తి క్లారిటీ లేని పరిస్థితి మొదట్లో నెలకొంది! అయితే తాజాగా ఈ కేసుకు సంబందించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కడప గడపలో కాలు పెట్టిన సీబీఐ.. దూకుడుగా ముందుకుపోతుందని తెలుస్తోంది!
హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ… విచారణ ప్రారంభించేసింది. ఏడుగురు గురు సభ్యులతో కూడిన ఈ సిబిఐ బృందం.. కడప ఎస్పీతో సమావేశం అయ్యారు. అనంతరం కేసుకు సంబంధించిన పూర్వాపరాలతో పాటు, ఆధారాలు అన్నీ కడప ఎస్పీ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సిబిఐ అధికారులు ఆది, సోమవారాల్లో పులివెందులలో అడుగు పెట్టనున్నట్టు సమాచారం!
గతంలో ఈ హత్యకు సంబందించి వైఎస్ వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ విచారణ కావాలని బలంగా డిమాండ్ చేసింది ఆమె! ఈ కేసుకు సంబందించి వైఎస్ కుటుంబంలోని కొంత మంది సభ్యులతో పాటు.. ఒక ఎంపీ పై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో హత్యజరిగిన ఇంతకాలానికి సీబీఐ రంగంలోకి దిగింది.. ఇప్పటికే కడప ఎస్పీని కలిసి ఆధారలు సేకరించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం… పులివెందులలో అడుగుపెట్టబోతోంది అనేసరికి.. మరింత ఆసక్తి మొదలైంది.. ముగింపు ఎలా ఉంటుందనేదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది!!