టెక్నాలజీ వచ్చాక పబ్లిసిటీ స్టంట్ లు కూడా మారిపోయాయి. ఒకానొక సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఉన్న తరుణంలో.. సదరు చానెల్స్ పత్రికలు ఏది చెబితే అదే ఏ న్యూస్ అన్నట్టు ఉండేది. కానీ ఆ మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా.. వార్తలు వడ్డీ వారించేవి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి రావటం జరిగిందో పరిస్థితులు మొత్తం మారిపోయాయి.
ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి న్యూస్ అయినా కొన్ని సెకన్లలోనే సామాన్యుడి చేతిలో కి ఆ వార్త వచ్చే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వరకు మీడియా బలం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొన్ని పార్టీలకు ఆయా మీడియా సంస్థలు కొమ్ము కాస్తూ వాళ్లే అధికారంలో ఉండాలి అన్న రీతిలో వార్తలు వడ్డించేవి. ఈ క్రమంలో మీడియా బలం ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పవచ్చు.
ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని మీడియా ఛానల్స్ మరియు పత్రికలు ఇష్టానుసారం అయిన రాతలు రాస్తూ ఉండగా.. వాటన్నిటికీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే ఎలక్ట్రానిక్ మీడియా చానల్ లకి వైసీపీ క్యాడర్ మరియు కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం ద్వారా చాలా వరకు చెక్ పెట్టడం జరిగింది. ఎల్లో మీడియా అనేక దుష్ప్రచారాలు చేసినా జగన్ 2019 ఎన్నికల్లో గెలవడానికి గల కారణాలలో ఒక కారణం వైసిపి సోషల్ మీడియా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు రాజకీయాలలో సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంది వైసిపి పార్టీ. ప్రత్యర్ధులు ఎన్ని దుష్ప్రచారాలు మీడియా ఛానల్స్ లో చేసిన వాటికి చెక్ పెడుతూ ఉన్నారు వైసిపి కార్యకర్తలు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రముఖ సర్వే సంస్థ దేశంలో అన్ని పార్టీల వెబ్ సైట్ ఆధారంగా సర్వే చేయగా, వైసీపీ పార్టీకి దేశవ్యాప్తంగా మూడవ స్థానం లభించటం జరిగింది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వెబ్ సైట్ ర్యాంకింగ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ టాప్ లో నిలిచింది. దీంతో సోషల్ మీడియా ట్రెండింగ్ లోనే,పార్టీ వెబ్ సైట్ ర్యాంకింగ్ లో అదేవిధంగా సీఎం రేసులో వైసిపి పార్టీ దూసుకుపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.