(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది.
ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26 తేదీన ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. అవార్డు కింద పది లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, ప్రజా సేవ చేసే వారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం జీవోలో సూచించింది.
కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవురపల్లి అమర్, రామచంద్రమూర్తి, జివిడి కృష్ణమోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ఐఏఎస్ అధికారులు కె దమయంతి, కె ఉషారాణి, కోన శశిధర్, టి విజయ్కుమార్ రెడ్డి, జెవి మురళి నియమితులైయ్యారు.