ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వానికి చెందిన నేతలు గట్టిగానే తిప్పి కొడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు అంటూ అసెంబ్లీలో వైసీపీ నేతలు మొదటిరోజు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్ట్ అయినా పోలవరం గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేక పోతే చరిత్ర హీనులయిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో వెంటనే వైఎస్ జగన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భారీ స్థాయిలో కౌంటర్లు వేశారు.
పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడమే కాక ఆ ప్రాంతంలో 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని కూడా పెడతా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ లో ఎమ్మెల్యేలంతా తీర్మాణం కూడా చేస్తాము అవసరమైతే అంటూ జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక మీటరు తగ్గితే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని ఈ విషయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించారని కేసీఆర్ చెప్పినట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కూడా జగన్ ప్రతిస్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గకుండా పూర్తి చేస్తామని చంద్రబాబు కి కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా వైసీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని జగన్ కుండబద్దలు కొట్టినట్టు అసెంబ్లీలో తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?