YSRCP: ఏపిలో ఈ నెల 26వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు నిర్ణయించారు. 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేపట్టే ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో సమావేశమై చర్చించారు. ఈ బస్సు యాత్ర, బహిరంగ సభల ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP: శ్రీకాకుళంలో తొలి బహిరంగ సభ
రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నదో ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తూ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీ శ్రీకాకుళం లేదా విజయనగరంలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు.