YSRCP Bus Yatra: ఓ వైపు ఒంగోలు మహానాడులో వైసీపీ సర్కార్ పై టీడీపీ విమర్శలు చేస్తుండగా మరో పక్క వైసీపీ నేతలు, మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభల్లో మహానాడు, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పల్నాడు జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నరసరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో టీడీపీ మహానాడుపై మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP Bus Yatra: మహానాడు కాదు ఏడుపునాడు
మంత్రి అంబటి రాంబాబు టీడీపీ మహానాడును ఏడుపునాడుగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు టీడీపీ మహానాడు వ్యతిరేకమని. చంద్రబాబుకు ఎల్లో మీడియా బాకా ఊదుతోందని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. 2024లో విజయం సాధించేది వైసీపీయేనని మరో సారి అన్నారు. మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోటో కూడా లేదనీ, అచ్చెన్నాయుడుకి సిగ్గు ఉండాలని అన్నారు మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బీసీలపై చంద్రబాబు ఎంత ప్రేమ ఉందో బట్టే అవుతుందని కారుమూరి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం పేరుతో యాత్ర చేసే హక్కు తమ పార్టీకే ఉందని అన్నారు కారుమూరి.
వైసీపీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబుకు భయం కలుగుతోందని అందుకే అబద్దాల ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైసీపీ సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోతుందని చెల్లుబోయిన. ఈ బహిరంగ సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ టీడీపీని, చంద్రబాబును ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యతను వివరించారు.