వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక సమావేశం నిర్వహణకు సన్నద్దం అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లతో సమావేశం కానున్నారు. నిన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీలతో సమావేశమైన జగన్ .. నేడు రీజనల్ కోఆర్డినేటర్ లతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు.
Read More: Pawan Kalyan: జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటి ..? నేడు క్లారిటీ వచ్చేస్తుందా..! ఢిల్లీలో పవన్ బిజీబిజీ
అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి, అంతర్గత సమస్యలపై రీజనల్ కోఆర్డినేటర్ లు నివేదికలను జగన్ కు ఇవ్వనున్నారు. గడప గడపకి మన ప్రభుత్వంతో పాటు పలు నూతన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్లు సమగ్రమైన నివేదికను పార్టీ అధినేతకు అందజేయనున్నారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం జగన్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహిస్తున్నారు జగన్. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అంతకు ముందు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.
YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్