కరోనా రాష్ట్ర నిధులను కొల్లగొట్టినా… ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతని నవరత్నాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా ప్లాన్ చేసుకుంటూపోతున్న ఏపీ సీఎం ఇదే నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువునున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రతీ సంవత్సరం 154 రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు కలిపి 75 వేల రూపాయల ప్రభుత్వం తరఫున సహాయం దక్కుతుంది.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వారి జీవనోపాధిని పెంచి జీవన విధానాన్ని మెరుగుపరచడమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 2,35,875 మహిళలు ఈ పథకం ద్వారా లబ్దిపొందే పొందబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది నిమిషాల్లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బుని నేరుగా పంపిస్తారు.
ఇకపోతే దీనికి లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల కన్నా తక్కువ ఉండాల్సి ఉండగా… పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల రూపాయల కన్నా తక్కువ ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి వైయస్సార్ కాపు నేస్తానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి పేరు మీద ఎటువంటి భూములు ఉండకూడదు మరియు 750 చదరపు అడుగులలోపా నివాసస్థలం ఉండవచ్చు.