వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయాలు మెగాస్టార్ చిరంజీవి చాలా సందర్భాలలో మద్దతు తెలపడం జరిగింది. మూడు రాజధానులు విషయంలో ఇంకా కొన్ని విషయాలలో చిరంజీవి వైసీపీ పార్టీని పొగడటం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా సీఎం జగన్ చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకుని అప్పట్లో ‘సైరా’ రిలీజ్ అయిన టైం లో సత్కరించడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి తర్వాత ‘లూసిఫర్’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా నటించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో రోజా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా రాణిస్తూ మరోపక్క పొలిటికల్ గా సక్సెస్ ఫుల్ లీడర్ గా కొనసాగుతున్న రోజా తాజాగా చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త ఫిలింనగర్లో పాటు పాలిటిక్స్ లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. అప్పట్లో ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రి, బిగ్ బాస్ సినిమాలలో చిరంజీవి సరసన రోజా నటించడం జరిగింది. కాగా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో రోజా నటిస్తున్నట్లు వార్తలు రావడంతో మెగా అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.