NewsOrbit
న్యూస్

వైసిపి యాక్టివ్ ఎమ్మెల్యే కి షాక్ ఇచ్చిన తండ్రి! పవన్ కల్యాణ్ తో భేటీ !!

పెనమలూరు వైసిపి శాసనసభ్యుడు కె పార్థసారధి తండ్రి మాజీ ఎంపీ కెపీ రెడ్డయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనకు హాజరై ఆయనకు రైతు సమస్యల గురించి వివరించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లాలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాలలో పవన్ కల్యాణ్ బుధవారం పర్యటిస్తుండగా కేపీ రెడ్డెయ్య పామర్రు వద్ద పవన్ కల్యాణ్‌ని కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెడ్డయ్య వివరించారు.ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఏపీ రెడ్డయ్య గతంలో శాసనసభ్యుడిగాను, మచిలీపట్నం ఎంపీ గానూ పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.ప్రస్తుతం ఆయన కుమారుడు పార్థసారధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పార్టీలో చురుకుగా ఉంటున్నారు.

ysrcp mla shocked his father meeting with pawan kalyan
ysrcp mla shocked his father meeting with pawan kalyan

జగన్ పై ఈగ వాలనీయకుండా ప్రతిపక్షాలపై ఒంటికాలిమీద పార్థసారధి లేస్తుంటారు.వచ్చే ఏడాది జరిగే మంత్రివర్గ విస్తరణలో పార్థసారథికి బీసీ కోటాలో స్థానం లభించవచ్చుననే ఊహాగానాలు కూడా ఉన్నాయి.గతంలో కాంగ్రెస్ హయాంలో పార్థసారధి మంత్రిగా ఉన్నారు.జగన్ తొలి కేబినెట్లోనే ఆయనకు స్థానం లభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ కారణంగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ఆ పదవిని దక్కించుకున్నారు. రేపటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మాత్రం పార్థసారథికి ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఆయన తండ్రి రెడ్డయ్య రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలుసుకోవడం అనేది సహజంగానే చర్చకు దారితీసింది.

ysrcp mla shocked his father meeting with pawan kalyan
ysrcp mla shocked his father meeting with pawan kalyan

రెడ్డయ్య రైతు సమస్యలపై పోరాడుతుంటారన్నది వాస్తవమే అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీకి చెందిన తన కుమారుడు పార్థసారధి ద్వారా జగన్ ప్రభుత్వానికి రైతు సమస్యలను విన్నవించాల్సింది పోయి వైసీపీకి బద్ధ శత్రువైన పవన్ కల్యాణ్ దగ్గరకుపోవటం అనేది ఆసక్తికరంగా మారింది.పార్థసారథి ద్వారా కాకుంటే అసలు మాజీ ఎంపీ హోదాలో ఆయనే కూడా ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపుకోవచ్చు.అవేమీ చేయకుండా రెడ్డయ్య నేరుగా పవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిశారన్నది వైసిపి లోనే చర్చకు దారి తీసింది.తండ్రి కొడుకులకు పొసగని నేపధ్యంలోనే రెడ్డయ్య తనదారి తాను చూసుకున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.మొత్తానికి ఈ పరిణామం మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పార్థసారధికి కొద్దిగా ఇబ్బందికరమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju