గతంలో ఇంట్లోకి దొంగలు వచ్చి ఎక్కడ అ సొమ్ముతో చేస్తారో అని రాత్రిపూట తలుపులు వేసుకునేటప్పుడు మరియు ఊర్లో కి వెళ్లేటప్పుడు జనాలు భయపడి చచ్చేవారు. అయితే ఈ టెక్నాలజీ మరియు సీసీ కెమెరాల రాకతో ఆ బెడద చాలావరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఇదే టెక్నాలజీ ఇంటి అడ్రస్ తెలియడం కాదు కదా కనీసం ముక్కు మొఖం తెలియని వారి డబ్బులు కూడా దొంగలింపబడేలా దోహదపడుతుంది. సైబర్ నేరగాళ్ళ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వారి చేతిలో సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా మోసపోతున్న తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కేంద్ర పథకాల పేరుతో రాష్ట్ర వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు మరియు సన్నిహితులకు సైబర్ క్రిమినల్స్ టోపీ పెట్టారు. రెండు రోజుల క్రితం సబ్సిడీ రుణాల పేరుతో ఎమ్మెల్సీ అనుచరుల నుండి 10 లక్షల రూపాయలు దోచేశారు. ముందు ఏదో మందకొడిగా వ్యవహరించిన వారు ఆ సొమ్మును ఇచ్చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఇక్బాల్ కు దీనిపై అనుమానం రావడంతో సీఎం పరిశ్రమ శాఖ అధికారులను ఆరా తీశారు.
ఇక అటువైపు నుంచి వారు అలాంటి పథకాలు ఏమీ అమలులో లేవని మరి అసలు దాని గురించి కూడా తమకు తెలియదని సమాచారం ఇవ్వడంతో ఖంగుతినడం ఎమ్మెల్సీ వంతు అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులు బాలాజీ నాయుడు, వెంకట రెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలాజీ నాయుడు గ్యాంగ్ పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపారు.