తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, వైసిపి పార్టీ నేత బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనా కారణంగా మృతి చెందారు. ఆయనకు కొంత కాలం క్రితం కరోనా సోకింది. అప్పటినుండి ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
1985లో బల్లి దుర్గ్రాప్రసాద్ రాజకీయ అరంగేట్రం చేసారు. గూడూరు నుండి ఎమ్మెల్యేగా పనిచేసారు. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసారు దుర్గాప్రసాద్. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయనకు పనిచేసిన అనుభవముంది. గత ఎన్నికలకు ముందు దుర్గాప్రసాద్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ తిరుపతి నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇక బల్లి దుర్గాప్రసాద్ మరణం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.