(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైసీపీ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుండి రుణంగా తీసుకున్న రూ.826.17 కోట్ల ను దారి మళ్ళించి దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఎంపి రఘురామ కృష్ణంరాజుతో సహా 9 మందిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది.
కేసు దర్యాప్తులో భాగంగా నేడు హైదరాబాదు, ముంబాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలు, ఇతర ప్రదేశాలలో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు, సోదాలపై సీబీఐ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలకు ముందు కూడా రఘురామ కృష్ణంరాజు నివాసాలు, కార్యాలయలపై సీబీఐ అధికారులు బ్యాాంకులను మోసగించిన కేసులో సోదాలు నిర్వహించారు.