పార్టీలో ఏదైనా సహించే జగన్ మరొకరు గ్రేట్ అనే మాటను మాత్రం అస్సలు సహించరు. అలాంటి జగన్ కి నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు పంటి కింద రాయిలా కంట్లో నలకలా తయారవుతున్నారు.
రఘురామకృష్ణంరాజు మాత్రం తనను తాను పెద్దోణ్ని చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు . గెలిచీ గెలవడంతోనే ఆయన కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టించుకుని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత జగన్ తెలుగు మీడియాన్ని తీసేస్తామని ప్రకటించగానే పార్లమెంటులో చర్చకు పెట్టారు. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. జగన్ మంచివారే.. అంటూనే ఆయన పాలనపై బురద జల్లుతున్నారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని పరిశీలిస్తున్న కొందరు విశ్లేషకులు అసలు ఏంజరిగింది? ఎందుకు ఇలా ఎంపీ వ్యవహరిస్తున్నారు? అనే కోణంలో పరిశీలించారు. ఈ క్రమంలోనే వారికి కొత్త విషయం తెరమీదికి వచ్చింది. తాను వైసీపీలోనే ఉంటారనేది ఈ విషయం స్పష్టం. అయితే, తన వ్యాపారాల రీత్యా.. వ్యవహారాల రీత్యా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తనకు చాలా పనులు ఉన్నాయి. వాస్తవానికి కేంద్రంలో సరైన మెజారిటీ రాకపోతే.. జగన్ బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉండి ఉంటే.. తానే చక్రం తిప్పాలని రఘురామ కృష్ణంరాజు భావించారు.
మొత్తంగా రఘురామ కృష్ణంరాజు వైఖరి చూస్తే.. కర్ర విరగ కుండా.. పాము చావకుండా.. తాను వైసీపీలోనే ఉంటూ.. బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు వ్యవహరిస్తూ.. తన పనులు చక్కబెట్టు కునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది . మరి మున్ముందు ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.