NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RRR: ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వైసిపి ఎంపీల ఎత్తుగడ!ఆర్ఆర్ఆర్ తో పాటు టీవీ5 చైర్మన్ పై ప్రధానికి ఫిర్యాదు!!

RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ నాయకత్వం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.ఒకవైపు అనర్హత వేటు వేయించడం తో పాటు వీలైతే పెద్ద క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించాలన్న వ్యూహాన్ని కూడా పన్నినట్లు కనిపిస్తోంది. పనిలో పనిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీవీ5 న్యూస్ ఛానెల్ ని కూడా వారు టార్గెట్ చేశారు. సోమవారం చోటు చేసుకున్న పరిణామం ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది.పదిహేను మంది వైసిపి ఎంపీలు నేరుగా ప్రధానిని కలిసి రఘురామకృష్ణంరాజు పై తీవ్రమైన అభియోగాలు మోపుతూఫిర్యాదు చేశారు.వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఈ ఎంపీల బృందానికి నాయకత్వం వహించారు.మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా వారు కలిసి రఘురామకృష్ణంరాజు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

YSRCP MPs complains to Prime Minister about TV5 chairman along with RRR !!
YSRCP MPs complains to Prime Minister about TV5 chairman along with RRR

ఎంపీల ఫిర్యాదు సారాంశమేంటంటే?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు వైసిపి ఎంపీలు తెలిపారు. వారిద్దరి మధ్య మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.రఘురామ కృష్ణంరాజు, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైసీపీ ఎంపీలు కోరారు.అయితే రఘురామకృష్ణంరాజు సబ్జెక్ట్ ఒక్కటే అయితే బాగుండదనుకున్నారేమో రాష్ర్టానికి ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్టుల గురించి కూడా ప్రధానికి వారు కొన్ని విజ్ఞప్తులు చేశారు.కాని ప్రధాని నుండి ఏ విధమైన స్పందన వచ్చిందో మాత్రం తెలియడం లేదు.

అదంతా విజయసాయిరెడ్డి విషప్రచారం!

మరోవైపు విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు చేసిన ఆరోపణలు, ఫిర్యాదుల మీద రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ అదంతా విష ప్రచారమని పేర్కొన్నారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని,మరి 20 కేసులున్న విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ఆయన ప్రశ్నించారు.తాను కూడా ఏవన్,ఏటు(జగన్ ,విజయసాయిరెడ్డి)ల అవినీతి బాగోతాలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.వారిద్దరి డొల్ల సూట్ కేసు కంపెనీల వివరాలన్నీ ప్రభుత్వానికి నివేదించానని, ముందుగా వారిద్దరి పైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరానన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు తాను బెదరబోనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju