స్థానికంగా ఎమ్మెల్యేలు బలంగా ఉంటే… ఢిల్లీ స్థాయిలో ఎంపీలు మరింత బలంగా ఉంటారని అన్ని స్థానిక పార్టీలు భావిస్తాయి. కానీ.. వైకాపా విషయంలో మాత్రం గెలిచేవరకూ ఓడమల్లన్న.. గెలిచాక బోడిమల్లన్నగా పార్టీని చూస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. ఇది ఇప్పుడేదో రఘురామకృష్ణంరాజుతో మొదలైది అనుకుంటే పొరపాటే. ఈస్థాయిలో కాకపోయినా సైలంట్ గా పోడిచి వెళ్లిపోయారు గతంలో బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత!
అవును.. గత ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచినా అందులో ముగ్గురు సొంత పార్టీలో ఉంటూనే పక్క పార్టీకి జై కొట్టారు. అదే రీతి కాకపోయినా మరో కొత్త తరహాలో నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు తనమార్కు రాజకీయాన్ని మొదలు పెట్టారు. సొంతపార్టీపై అభిమానం పీకలదాకా ఉందని చెబుతూనే.. ప్రత్యర్ధిపార్టీల ఛానల్స్ లో తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తాజాగా తిరుపతి వైకాపా ఎంపీపై కూడా మెల్లమెల్లగా రూమరలు మొదలయ్యాయి. వీటిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారనుకోండి… అది వేరే విషయం!
అయితే ఇలా వరుసపెట్టి ఎంపీలు జగన్ కు దెబ్బకొట్టడానికి గల కారణాలను విశ్లేషకులు పలురకాలుగా విశ్లేషిస్తున్నరు. వాటిలో మొదటిది… జాతీయ స్థాయిలో వీరికి వ్యాపారాలు ఉండటం కాగా మరొకటి.. స్థానికంగా ఆర్థికాభివ్ర్ద్ధి కోసం అని మరికొందరు అంటున్నారు. కారణం ఏదైనా.. ఇలాంటి పనులు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్ అని ఆ రెబల్స్ ఫీలవుతున్నా.. జనాల్లో మాత్రం పలుచన అయిపోతున్నారన్న విషయం మరిచిపోకూడదని పలువురు సూచిస్తున్నారు.