వైసీపీలో లో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికైన కారణంగా ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అంత మంది ఎమ్మెల్యేలలో ఆ ఎమ్మెల్యే సీట్లు ఎవరికి లభిస్తాయి మరియు ఏ ప్రామాణికాల ద్వారా మంత్రులను ఎంచుకుంటారు అన్న విషయం పై చాలా సందిగ్దత నెలకొంది.
దీంతో అందరూ జగన్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూడగా చివరికి సిదిరి అప్పలరాజు మరియు వేణుగోపాలకృష్ణ ఏపీ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
ఇక వీరిరువురి కి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వనునారో తెలియాల్సి ఉంది. అలాగే వీరికి మంత్రి పదవులు ఇచ్చే సమయంలోనే జగన్ ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చబోతున్నారన్న విషయం కూడా బయటికి వచ్చింది. మరి జగన్ ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలను కట్టబెడతారు అన్న విషయంపై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.