అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా పడింది. తాడేపల్లిలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శనివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికను వాయిదా వేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా అంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. కేంద్రాన్ని ఒప్పించి హోదా సాధించేలా పార్లమెంట్ సభ్యులు కృషి చేయాలని జగన్ అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హమీల కోసం నిరంతరం శ్రమించాలని జగన్ సూచించారు.
సమావేశంలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, 22మంది పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.