Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ పార్టీ మద్దతుదారులు భారీ స్థాయిలో గెలవటం అందరికీ తెలిసిందే. రెండో దశ ఎన్నికలలో కూడా వైసీపీ హవా నడిచింది. మొదటి దశ మాదిరిగానే రెండో దశ ఎన్నికలలో కూడా వై సీపీ మద్దతుదారులు స్పష్టమైన మెజారిటీతో గెలవడంతో జాతీయ మీడియాలో 2019 ఎన్నికల మాదిరిగానే జగన్ దూసుకుపోతున్నారు అంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల లో వచ్చిన ఫలితాలపై కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలయ్య బాబు..నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. జరుగుతున్న ఎన్నికల విషయంలో పార్టీ నాయకులకు మరియు నియోజకవర్గం కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మున్సిపల్ ఎన్నికలలో కీలకంగా రాణించాలని పేర్కొనటం జరిగింది. ఇలాంటి తరుణంలో హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపే వంద కుటుంబాలు బాలయ్య బాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక్కసారిగా నియోజకవర్గంలో వంద వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి వెళ్లడం తో ఈ వార్త ఏపీ లో చర్చనీయాంశంగా మారింది.
మరో పక్క బాలయ్య బాబు జరగబోయే ఎన్నికలలో ఈసారి టీడీపీకి బలమైన స్థానాలు గెలిచే రీతిలో ప్రతి కార్యకర్త కష్టపడాలని నియోజకవర్గ టిడిపి క్యాడర్ కి దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీ కార్యకర్తల కుటుంబాలతో కూడా బాలయ్య బాబు మమేకమై ఉండటం విశేషం. ఇదిలాఉంటే ఇటీవల చాలా వరకు బాలయ్య బాబు అభిమానులతో కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా కాకుండా కలిసిపోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు త్వరలో ఇక పూర్తి స్థాయి రాజకీయ నేతగా రాణించటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.