Danush : ధనుష్ గత కొంతకాలంగా అద్భుతమైన కథలని ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. మారి సినిమాలతో ఎలాంటి హిట్స్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన అసురన్ సినిమాతో భారీ హిట్ తన అకౌంట్ లో వేసుకున్నాడు. కల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన అసురన్ కోలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబట్టింది. అదే సినిమాని తెలుగులో నారప్పగా విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. కాగా ధనుష్ ఇప్పుడు పాన్ ఇండియన్ కథల మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా సమాచారం.
ఈ క్రమంలోనే గతంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన సినిమా సీక్వెల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా బహుభాషా చిత్రంగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక ఆ సూపర్ హిట్ సినిమా యుగానికి ఒక్కడు. ఈ సినిమా కథా నేపథ్యం చోళులు పాండ్యులకు సంబంధించినది. ఈ కథని ఎంతో ఉత్కంఠత తో తెరకెక్కించాడు దర్శకుడు సెల్వ రాఘవన్. 7/జి బృందావన కాలనీ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సెల్వ.
Danush : సీక్వెల్ లో కార్తి కాకుండా ధనుష్ ని ఎందుకు ఎంచుకున్నాడన్నది మాత్రం క్లారిటీ లేదు.
తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ తో ఆడవారి మాటలకి అర్థాలే వేరులే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సెల్వ రాఘవన్ శ్రీరాఘవగా పేరు మార్చుకున్నాడు. కాగా ఇప్పుడు యుగానికి ఒక్కడు సినిమా సీక్వెల్ ని ధనుష్ తో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో సెట్స్ మీదకి రానున్న ఈ సినిమా 2024లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. మరి సీక్వెల్ లో కార్తి కాకుండా ధనుష్ ని ఎందుకు ఎంచుకున్నాడన్నది మాత్రం క్లారిటీ లేదు.