టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చిన సమయంలో వై వి సుబ్బారెడ్డి బాబుపై గట్టిగా రియాక్ట్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రారంభంలో లోకల్ ఎన్నికలు స్టేట్ ఎన్నికల కమిషన్ వాయిదా వేయటం మనకందరికీ తెలిసిందే.
మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే దేశంలో ఢిల్లీలో సెకండ్ వేవ్ మళ్లీ స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా లాక్ డౌన్ కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ప్రాణాలను ఇబ్బందులపాలు చేసినట్లు అవుతామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలని సూచించారు.
లోకల్ ఎన్నికలు ఎదుర్కోవడంలో చంద్రబాబు కి దమ్ము ధైర్యం లేదని వై వి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే పక్క రాష్ట్రంలో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మా పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు భయపడాల్సిన అవసరం తమకు లేదని, తిరుపతి ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గత మెజారిటీ కంటే భారీ స్థాయిలో మెజారిటీ సాధించడానికి వైసిపి రెడీగా ఉన్నట్లు వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే జగన్ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకులతో చర్చలు జరిపినట్లు, ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే వైసిపి పార్టీ అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.