పేటీఎం యూజర్ల కోసం ఆ సంస్థ తీపికబురు తెచ్చేసిందండోయ్.. అవును స్వయంగా పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ వర్మ ఆ వార్తను తెలిపారు. తమ కస్టమర్ల కోసం ఈ బెనిఫిట్ ను ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. మరి అదేంటనుకుంటున్నారు కదా.. మరికెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ ను చదివి ఆ బెనిఫిట్ ఏంటో చదివేయండి..
పేటీఎం కు చాలా మంది యూజర్లు కొనసాగుతున్నారు. కాని ఈ పేటీఎం లో కొన్ని విషయాల పట్ల అసంతృప్తిగా కూడా ఉన్నారు. అదేనండి కొన్ని చార్జీల విషయాల్లో.. అందుకే ఆ చార్జీలను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించేసింది. ఇంకేముంది దీంతో యూజర్లు ఫుల్ కుషీగా ఉన్నారు. దీంతో వారికి మంచి బెనిఫిట్ కూడా కలుగుంది.
కాగా సాధారణంగా పేటీఎం వాలెట్ లోని డబ్బును బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలంటే దానికి చార్జీలను పే చేయాల్సి వచ్చేది. కాగా ఇప్పుడు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే ఆ చార్జీలను మనం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని పూర్తిగా తొలగిస్తున్నట్టు పీటీఎం వ్యవస్థాపకుడే స్వయంగా ఆన్ లైన్ లో ద్వారా ప్రకటించారు.
కాని క్రెడిట్ కార్డు నుంచి డబ్బులను పేటీఎం వాలెట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చార్జీలను చెల్లించాల్సిందేనండోయ్. దీనిలో చార్జీల తొలగింపు మాత్రం లేదు. దీనిపై 2 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా.. ఒక మంచి నిర్ణయం తీసుకుని పేటీఎం యూజర్లకు దిల్ కుష్ చేసింది ఈ కంపెనీ.