Zika virus: కేరళ లో లో మొదటి వేవ్ భారత్ లోకి ప్రవేశించిన సమయంలో అతి తక్కువ సమయంలోనే అత్యధికమైన ఇన్ఫెక్షన్లు జరిగాయి. ఆ రాష్ట ప్రజలు ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలతో త్వరగానే కోలుకున్నప్పటికీ ముందునుండి ‘నిపా వైరస్’ వంటి కొత్త రకం వైరస్ లు దేశం లోకి ప్రవేశించినప్పుడు కేరళ లో మొట్టమొదటిగా బయటపడడం చూడవచ్చు.
ఇక తాజాగా మనకి పరిచయం ఉన్న ‘జికా వైరస్’ కేరళలో వ్యాపిస్తోంది అన్న వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఒకేరోజు 13 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఒక్క నెలల వయసున్న శిశువులో కూడా ఈ వైరస్ బయటపడింది. కేరళ రాజధాని తిరువనంతపురం నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి కొన్ని శాంపిల్స్ పంపించారు. వాటిలో 24 ఏళ్ల గర్భిణీ శాంపిల్ చూసినట్లయితే ఆమె తీవ్రమైన జ్వరం, తలనొప్పి తో బాధపడుతూ ఉండగా అలాగే చర్మంపై ఎర్రటి మచ్చలను గుర్తించారు.
‘ఎయ్డెస్’ అనే ఒక రకమైన జాతి దోమలు నుండి ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. ఇక ఈ దోమలు పగటిపూటే ప్రజలను కుడుతాయి. ఇక ఇవే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. ఇక గర్భిణుల నుండి తమకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వైరస్ సోకిన వారి పుట్టినప్పుడే అంగవైకల్యంతో పుట్టే అవకాశం కూడా ఉంది.
జికా వైరస్ సోకిన వారు రెండు నుండి ఏడు రోజులు లక్షణాలతో బాధపడతారు. అయితే చివరికి వారు కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనికి ఎటువంటి మందు ఇప్పటికీ కనుక్కోలేదు. యునైటెడ్ నేషన్స్ మాత్రం ఎక్కువగా విశ్రాంతి తీసుకొని, ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచించారు. నొప్పి, జ్వరం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే దోమలు మన వైపు రాకుండా చూసుకోవాలి.
ఇక కేరళ అయితే ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది కానీ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.