మనది పవిత్ర భారతభూమి అని తెలుగులో అన్నారు
ఔనా అనుకున్నాను. ఒకప్పుడు పవిత్రంగా ఉందేమో!
మేరా భారత్ మహాన్ అన్నారు. ఔరా అనుకున్నాను.
పవిత్రత సంగతి తేలలేదు కానీ.. స్వచ్ఛత పోయింది.
నిక్షేపం లాటి మట్టిని విషం చేసేరు.
ఒకప్పుడు పంటలు కూరలు పళ్ళు అన్నీ సహజమైన ఎరువులతో పండించేరు.
కేవలం పశువుల ఎరువులు, కుళ్ళిన ఆకులు బలానికి వేసేవారు.
అందుకే ఆ తిండి తిన్నవాళ్ళం ఇంకా గట్టిగానే ఉన్నాం.
ఆ తిండికి రుచి ఉంది, పోషకాలు ఉన్నాయి. అందుకే అప్పుడు ఇన్నిజబ్బులు లేవు.
నెమ్మదిగా మనిషికి ఆశ పెరిగింది.. అంతే.
రసాయన ఎరువుల ఫ్యాక్టరీలు వెలిసేయి.
వీటి వల్ల దిగుబడి పెరుగుతుంది కానీ రుచి, పోషకవిలువలు పోయేయి.
ఏవి తిన్నా బలం లేదు, ఆరోగ్యమూ లేదు.
మిరపకాయలు, టొమోటోలు ఎప్పుడైనా చూసేరా అచ్చు పైంటింగ్లాగా ఉంటాయి.
రూపురేఖలమారి కాపురానికి చేటు అన్నట్టు వాటికి అందం తప్ప ఆరోగ్యం లేదు
మనం ఇంకా అభివృద్ధి అయి పోయి అన్నిటిమీద పురుగుల మందు వాడుతున్నాం
అవన్నీ విషమే. వాటి ఫలితం ఈ జబ్బులు.
మళ్లీ కొత్త మందులు కనిపెడతాం.
ఇవన్నీ చాలావరకు మల్టీనేషనల్ కంపెనీలే.
సరే ఇక నీటి సంగతి చెప్పనక్కరలేదు.
స్వచ్ఛమైన నీరు మరిచిపోయేం.
కూల్ డ్రింకులు సరేసరి వాటినిండా విషమే.
వ్యాపారాలు, ఫారిన్ ఎక్స్చేంజి, లాభాలు ఇవి కాదు ముఖ్యం.
ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం.
డాక్టర్లు పళ్ళు తినండి అంటారు, తింటున్నారు. కానీ ఏది ఆరోగ్యం!
భూమి కలుషితం.
గాలి కలుషితం.
తిండి విషం.
నీరు కలుషితం.
విషపు తిండి తింటూ కుళ్లుగాలి పీలుస్తూ బురద నీరు తాగుతూ ఎన్నేళ్లు ఆరోగ్యంగా ఉంటాం
అందుకే మన మనసులు కూడా కుళ్లిపోయేయి.
హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ!
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ