Poll : న్నో ట్విస్టులు, కోర్టు కేసులు, వాయిదాలు, పిటిషన్ లు, వాదనలు, తిరస్కరింపుల మధ్య నలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు చివరికి మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. నిమ్మగడ్డ రమేష్ తాను రిటైర్ అయ్యే లోపు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న ఈ ఎన్నికలు చివరికి ప్రభుత్వం సహకారంతోనే జరగనున్నాయి. అయితే ఇక్కడ నిమ్మగడ్డ గెలిచాడా…? లేదా జగన్ గెలిచాడా…? అన్న వాదన పక్కనపెడితే….
ఇంత ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో పైచేయి ఎవరు సాధిస్తారు అన్న విషయంపై ఇప్పుడు అందరూ దృష్టి పెట్టారు. అనాదిగా అధికారపార్టీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా గత ఏడాది పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు దాదాపు చాలా చోట్ల వైసిపి ఏకగ్రీవంగా నామినేషన్ వేసిన సంగతి కూడా ఇక్కడ గమనించదగినది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు హింసాత్మకంగా ఎన్నికలు ఏకగ్రీవం చేశారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ…. అప్పుడు ఎన్నికలు గనుక జరిగి ఉంటే వారికి అఖండ మెజారిటీ వచ్చేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు కాలం గడిచింది… పరిస్థితులు మారాయి. ప్రభుత్వం పూర్తి ఒత్తిడిలో ఉంది. అయితే జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మరొకవైపు చంద్రబాబు వీలు చూసి దెబ్బకొట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఇక బిజెపి, పవన్ కళ్యాణ్ జనసేన అయితే తమ కూటమి సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలియజెప్పాలని ఎంతో ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేదా అన్న విషయం పైన ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మాత్రం ఏకగ్రీవ ఎన్నికలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తుంటే…. ప్రతిపక్షం మాత్రం ఈసారి అంత ఛాన్స్ ఇచ్చేది లేదు అని అంటున్నారు. బిజెపి-జనసేన అయితే తమ ఉనికిని చాటేందుకు ఇదే సరైన అవకాశం అని భావిస్తున్నారు..! ఇలాంటి పరిస్థితుల్లో…
ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని “న్యూస్ ఆర్బిట్” ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[yop_poll id=”18″]