Poll : Peddireddy Ramachandra Reddy : ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో మొదటి నుండి వైసీపీకి ఎలక్షన్ కమిషన్ కు మధ్య జరుగుతున్న పోరు గురించి తెలిసిందే. ప్రభుత్వం తో ఎన్నో నెలల తలపడి నిమ్మగడ్డ చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చేసేదేమీ లేక ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.
ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతాం అంటూ జిల్లా అధికారులను హెచ్చరించిన ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికలు ముగిసేవరకు అంటే ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని బయటకు అనుమతించవద్దని కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవద్దని ఎస్ ఈ సి స్పష్టం చేసింది.
అయితే పెద్దిరెడ్డి మాత్రం నిమ్మగడ్డకు మతిభ్రమించింది అని… అతను చంద్రబాబు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని…. ఒక మంత్రి ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఇంగిత జ్ఞానంలేని తెలిసీ తెలియని మూర్ఖుడు అని నిప్పులు చెరిగారు. కానీ ఎస్ ఈ సీ మాత్రం ఈ విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కొంత మంది ప్రజలేమో నిమ్మగడ్డ అత్యుత్సాహానికి పోతున్నాడని అనుకుంటే మరికొందరు కక్షసాధింపు చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. అయితే ఎస్ ఈ సి మాత్రం రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేసేందుకు ఎన్నికలు నిజాయితీగా…. నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని “న్యూస్ ఆర్బిట్” ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[yop_poll id=”19″]