ఎట్టకేలకు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభం అయ్యింది. స్థల సేకరణలో వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలుగా నెలలు తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు కావడంతో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి అనేది తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నారు.
కానీ టీడీపీ మాత్రం ఇది 6500 కోట్ల స్కామ్ వ్యవహారం అనీ జగన్ మోహన్ రెడ్డి భారీగా ఇందులో డబ్బు సంపాదించుకున్నారు అనీ ఆరోపిస్తున్నారు. వై ఎస్ జగన్ ఒకప్పుడు తండ్రి సిఎం గా ఉన్నప్పుడు చేసిన స్కామ్ లనే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు అనీ , ఈ సారి తానే ముఖ్యమంత్రి కాబట్టి రెండు లక్షల కోట్ల ప్రభుత్వం ధనం కాజేయడమే లక్ష్యంగా బరిలోకి దిగారు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది టీడీపీ. దీనిమీద రోజూ ప్రెస్ మీట్ లు పెడుతూ లోకేశ్ హడావిడి చేస్తుంటే సమాధానం గా కొడాలి నాని కూడా ఒక రేంజ్ లో గొడవ పడుతూ కౌంటర్ రిప్లయ్ లు ఇస్తూ హడావిడి చేస్తున్నారు.
వీరిద్దరి హడవీడీ కాసేపు పక్కన పెడితే .. ఇళ్ల పట్టాలు తీసుకుని కొందరు హ్యాపీగా ఉంటే మరికొందరు మాత్రం తమకి పట్టాలు రాలేదు అని బాధ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ని డీల్ చేయడం ఎలా అనేది అర్ధం కాక ప్రతిపక్ష విపక్షాలు కొట్టుకు చస్తున్నాయి.
[yop_poll id=”15″]
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ