ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రంగా గత కొద్ది నెలలుగా అనేక రాజకీయ పరిణామాలు తీవ్రమైన మలుపులు తీసుకున్నాయి. ఒక పక్క రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో తాను రిటైర్ అయిపోయేలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని పట్టుదలగా ఉంటే మరొక వైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఉన్నన్ని రోజులు స్థానిక ఎన్నికలు జరగకుండా తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర హైకోర్టు ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం, ఆలస్యం కలగకూడదని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వెనక్కితగ్గని నిమ్మగడ్డ వర్సెస్ జగన్
అయితే పట్టువదలని నిమ్మగడ్డ మరో పిటిషన్ తో రెండు ప్రక్రియలు ఒకేసారి జరిగే లాగా కోర్టు వారి దగ్గర నుండి తనకు అనుకూలమైన నిర్ణయం రాబట్టాడు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గే సమస్యే లేదన్నట్లు ప్రవర్తిస్తోంది. ఏకంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఇక ఈ ఫైట్ లో ఒకసారి ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తే మరొకసారి మరొకరు ముందంజలో ఉంటున్నారు. చివరికి మరికొద్ది రోజుల్లో ఈ అంశం కొలిక్కి వచ్చే లాగా కనిపిస్తోంది.
అయితే ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థల మధ్య ఎటువంటి సంఘర్షణ ప్రజలకు మేలు చేకూర్చే అంశం అయితే కాదు. ఒకపక్క ప్రభుత్వం ఒకపక్క ఎన్నికల కమిషన్ వంటి అత్యున్నత వ్యవస్థలు ఇలా పంతాలకు పోయి కోర్టు వారి దగ్గర పోట్లాడుకోవడం అన్న విషయంపై ప్రజలకు అనేకానేక అభిప్రాయాలు ఉంటాయి. ఒకపక్క కరోనా మహమ్మారి… తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఎన్నికలు రెండు ఒకేసారి జరగడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.
ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని “న్యూస్ ఆర్బిట్” ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[yop_poll id=”17″]
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?