ఇప్పుడు మాఅమ్మ ఉంటే అరగంట క్లాస్ పీకేది
ఏవిటే సుందరం ఉల్లిపాయలు కిలో వంద రూపాయిలా
ఎవరైనా వింటే నవ్వుతారు
రెండు కిలోల బియ్యం వస్తాయి
చిత్తం..కానీ బియ్యంతో కూర వండలేవు
అవునే మనలాటివాళ్ళం ఎలాగో బతికేస్తాం
పాపం లేబర్ వాళ్ళు యేవిఁతింటారే
కుండెడు నీళ్లలో అర్ధసేరు బియ్యం పోసి గంజి వార్చి ఆ గంజిలోనే అన్నం వేసి ఒక మిరపకాయ ఒక ఉల్లిపాయ నంచుకుని తింటారు
మరి ఇప్పుడు ఆ ఉల్లిపాయ కూడా లేకపోతే ఏవిటి తింటారు
వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరా
కోరు అన్నాను
పాపం వాళ్ళు పొద్దుటినించి సాయంత్రం వరకు కష్టపడతారు
కడుపుకి ఇంత తిండి లేకపోతే ఎలాగే
ఐనా యీ ధరలు ఇలా పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటే ఎలా
బావుంది
టెక్నాలజీ పెరిగింది
జనాభా పెరిగింది
అవినీతి పెరిగింది
నేరాలు పెరిగేయి
అన్నీ అభివృద్ధి అవుతున్నాయి కదా మరి ధరలు మాత్రం అభివృద్ధి అవవా
డాక్టర్లు పళ్ళు తినండి అంటారు
అవి కొనే స్థితిలో ఉన్నాయా
ఇదివరకు రిక్షావాళ్లు ఆటోవాళ్ళు ఆకలి వేస్తే రెండు అరటిపళ్ళు తిని కప్పు టీ తాగేవారు
ఇప్పుడు అరటిపళ్ళు ఏంటో తెలుసా
డజను అరవై రూపాయలు అంటే పండు ఐదు రూపాయలు
అవి తినేకన్నా తినకపోవడవే మంచిది రుచి పచి ఉండవు
అంతా కల్తీ
అసలు యీ ధరలు ఎవరు నిర్ణయిస్తారు
పండించేవాడా
అమ్మేవాడా
పండించేవాడు పస్తులు ఉంటున్నాడు
ఇటు తినేవాడు కొనలేడు
యాపిల్ ద్రాక్ష అక్కర్లేదు కనీసం గంజి ఐనా తాగనివ్వండి
ఉల్లి చేసిన మేలు తల్లి చెయ్యదు అంటారు
భారత దేశం రత్నగర్భ అంటారు కానీ రత్నాలూ రాళ్ళూ తినం
భారతదేశం అన్నపూర్ణ అని కూడా అన్నారు
గొప్పలు చెప్పడం మనకి అలవాటు
యీమధ్య బంగారం ధర పెరిగిందని గోల పెట్టేరు
బంగారం వజ్రాలు పెరిగితే ఎవరిక్కావాలి
జనానికి కావలసింది పిడికెడు అన్నం మూరెడు బట్ట అన్నారు
మనం అవి ఇవ్వడం లేదు
మరేవిటి యిస్తున్నాం
వ్యసనాలు అంతే
అందరికీ విద్య అన్నారు ముందు అందరికీ తిండి చూడండి
తరవాతే మిగిలినవి
తిండి కలిగితే కండ గలఁదో య్ కండ గలవాడేను మనిషోయ్ అన్నాడు గురజాడ
మనకి తిండి లేదు
కండ లేదు
మరి మనం మనుషులమేనా
ఏమో
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ