2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దాదాపు టిడిపి పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయిన టిడిపి ఏపీలో కూడా కొద్దిపాటి మెజార్టీతో ప్రతిపక్షాన్ని దక్కించుకోవడంతో వచ్చిన ఫలితాలు చూసి టిడిపి చాప్టర్ క్లోజ్ అని అందరూ భావించడం జరిగింది. ఫలితాలు వచ్చాక చాలా మంది పార్టీలో ఉన్న కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా కానీ చంద్రబాబు ఉన్న కొద్దిపాటి బలం తో తన చాణిక్య మైండ్ గేమ్ తో 16 నెలల పాటు బాగానే పార్టీని లాక్కొచ్చారు.
కాగా రాజకీయంగా ప్రభుత్వం పై చేయి సాధించడానికి ఇంగ్లీష్ మీడియం, ఇసుక విధానం తర్వాత ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు అనేక రీతులుగా ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనబడలేదు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో చంద్రబాబు సరైన రీతిలో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తే గ్యారెంటీగా పొలిటికల్ గా టిడిపి పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందన్న వాదన ప్రస్తుతం ఏపీ మీడియా సర్కిల్ లో వస్తోంది. 16 నెలల తర్వాత ఈ అదిరిపోయే ఈ పాయింట్ తో రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయం చేస్తే చాలావరకు పొలిటికల్ మైలేజ్ సంపాదించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువ అవటంతో ఆ వర్గాల్లో కొంత వ్యతిరేకత ప్రభుత్వంపై ఏర్పడినట్లు టాప్ వస్తుంది. మరోపక్క దేవాలయాలపై దాడులు జరుగుతున్న క్రమంలో సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో కీలకంగా రాణిస్తే మాత్రం… టిడిపి పార్టీకి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందని మేధావులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దేవాలయాల పై దాడుల విషయంలో బీజేపీ అతిగా స్పందిస్తున్న నేపథ్యంలో…. చాలా వరకూ ఈ దాడుల వెనుక వారి హస్తం ఉందన్న వాదన ప్రజలలో ఉన్నట్లు టాక్ వస్తుంది.
ఇలాంటి టైమ్ లో గనుక చంద్రబాబు ఎంటర్ అయితే గనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నేతగా ఆవిష్కృతం అవడం గ్యారెంటీ అనే టాక్ వస్తోంది. కరోనా సమయంలో ఎల్జి పాలిమర్స్ ఘటన, ఆ తర్వాత విశాఖ లో కొన్ని ఘటనలు జరిగినా గాని పెద్దగా టిడిపి స్పందించిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు దేవాలయాల పై జరుగుతున్న దాడులు విషయంలో చంద్రబాబు సరైన రీతిలో రాజకీయం చేస్తే మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం రావటం గ్యారెంటీ అనే విశ్లేషణలు వస్తున్నాయి.