2020 అంటూ న్యూ ఇయర్ టైం లో చాలామంది తెగ ఎంజాయ్ చేశారు. కానీ స్టార్టింగ్ నుండి 2020, ప్రతి ఒక్కరితో 2020 మ్యాచ్ ఆడుతున్నట్లు పరిస్థితులు దాపురించాయి. ముఖ్యంగా కరోనా వైరస్ రాకతో ఒక్కసారిగా అందరి జీవితాలు భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు అంతా తారుమారయ్యాయి. రోజు రోజుకి దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోవటంతో పాటు మరోపక్క వ్యాక్సిన్ ఇంకా రాకపోవటంతో ప్రతి ఒక్కరిలో ప్రాణ భయం నెలకొంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో అంతుబట్టని సంఘటన ఆ ప్రాంతంలో అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
పూర్తి విషయంలోకి వెళితే గత కొన్ని రోజుల నుండి ముంబై నగరంలో అర్ధరాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన రావటంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్ట లేకపొయ్యారు. ముంబై రాష్ట్రంలోని అంధేరి, ఘట్కోపర్, విఖ్రోలీ, చెంబూర్ తదితర ప్రాంతాల్లో భరింపరాని వాసన వస్తుండడంతో ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి వాళ్లకి 17 ఫైరింజన్లు కూడా ప్రొవైడ్ చేసి వాసన ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటివరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వాసన ఎక్కడ్నించి వస్తున్నదో కూడా గుర్తించలేకపోయారు. అయితే, ఇది గ్యాస్ లీక్ వాసన అయ్యుండదని భావిస్తున్న అధికారులు, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కరోనా భయం తో పాటు ఈ సరికొత్త వాసన భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?