NewsOrbit
రాజ‌కీయాలు

‘దివిసీమ ఉప్పెన’.. ఆ కాళరాత్రికి 43 ఏళ్లు..!

43 years for diviseema uppena storm

సముద్రాల్లో ఏర్పడే ఉపరితల ఆవర్తనం వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫానుగా మారతాయి. తీరాల్ని తాకి అల్లకల్లోలం సృష్టిస్తాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి. కానీ.. ఇవేమీ లేనప్పుడు ఒక మహా ఉత్పాతం.. ప్రళయమై వచ్చింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచి పెట్టేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయిన ఆ విధ్వంసమే.. ‘దివిసీమ ఉప్పెన’. 1977 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన ఆ రాకాసి తుఫాను చేసిన భీభత్సం ఇప్పటికీ ఆ ప్రాంతవాసులను కలవరపెడుతూనే ఉంది. నేటితో ఆ మహా ప్రళయానికి 43 ఏళ్లు పూర్తయ్యాయి.

43 years for diviseema uppena storm
43 years for diviseema uppena storm

ఆరోజు కాళరాత్రే అయింది..

నవంబర్ నెల, టెక్నాలజీ లేని రోజులు కావడంతో ఎటువంటి తుఫాను సంకేతాలు లేవు. కానీ.. 1977 నవంబర్ 18న సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా తీరం దాటి ఊళ్లలో పైకప్పులా పది మీటర్ల ఎత్తులో పరుచుకుంది. భారీ వర్షం పడుతుందని భావించారే కానీ.. ఆ రాత్రి ఓ ప్రళయ రాత్రి కాబోతోందని దివి ప్రజలు ఊహించలేదు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా తీరం దాటిన ప్రళయ తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రాకాసి అలలు ఊళ్లను ముంచేసాయి. హోరు గాలికి, రాకాసి అలలకు ప్రజలు బలైపోయారు.

చెట్టుకొకరు.. పుట్టకొకరు..

అధికారిక అంచనానే 10వేలకు పైగా మృతులు. ఇల్లూ, పిల్లా, కుటుంబాలు, పశువులు.. నామరూపాలు లేకుండా పోయాయి. గుట్టలుగా తేలిన శవాలు.. తమ వారెవరో గుర్తుపట్టలేని బంధువులు.. కళేబరాలై తేలిన పశువులు, స్మశానాలుగా మారిన ఊళ్లు, వేళ్లతో సహా పెకిలించబడ్డ చెట్లు.. ఇలా దివిసీమ పెను ప్రళయానికి సాక్ష్యాలుగా నిలిచాయి. పాచిపోయి, కుళ్లిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి. ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. మదర్ థెరిసా కూడా వచ్చి సహాయం చేశారు. మిషనరీలు, గాంధీ పీస్ ఫౌండేషన్, ఆర్ఎస్సెస్ వంటి సంస్థలు ప్రజలకు సాయం అందించాయి. ఎంత సాయం అందించినా కోలుకోలేని విలయం అది. అందుకే ఇప్పటికీ ‘దివిసీమ ఉప్పెన’ అనే పదం.. అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది.

 

 

 

 

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?