2020-21 ఏడాదికి సంబంధించి వివిధ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. గతంలోనే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ పాదయాత్రలో అదేవిధంగా ఎలక్షన్ ప్రచారంలో సీజన్ ప్రారంభానికి ముందే పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వరి క్వింటాలుకు 1880 రూపాయలు, మిర్చికి 7000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తున్నట్లు… పత్రికా ప్రకటనల ద్వారా తెలిపింది.
మొత్తం ఇరవై నాలుగు గంటలకు ధరలను పత్రికా ప్రకటన ద్వారా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పసుపు పంట క్వింటాలుకు 6850 మద్దతు ధర నిర్ణయించింది. ఫిబ్రవరి నుంచి మే వరకు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మిర్చి పంటను డిసెంబర్ నుంచి మే వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఉలికి మద్దతు ధర క్వింటాలుకు 770 రూపాయలు నిర్ణయించారు. ఖరీఫ్, ముందస్తు ఖరీఫ్, రబీ సీజన్ లో కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు.
పెసలకు, గ్రేడ్ ఏ ధాన్యానికి, కందులు, మినుములు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న అదే విధంగా కొబ్బరి బాల్ వంటి వాటికి ధర నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయొద్దని… ఖజానా గురించి అధికారులు చెప్పిన తరుణంలో జగన్ తెలిపారట. రైతులకు మద్దతు ధర విషయంలో ఎక్కడా కూడా కష్టం రాకుండా చూడాలని రైతు బాధ పడితే వాళ్ళ కంటే ముందు నేను ఎక్కువ బాధపడతా అని ఓపెన్ గా.. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర విషయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ తెలిపారట. వీలుంటే మద్దతు ధర కన్నా ఎక్కువకే కొనుగోలు చేయాలని సూచించారట.